భారత న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో తెలియాలంటే ఒక్క "జై భీమ్ " సినిమా చాలు. ఎంతటి వ్యతిరేక శక్తులు ఏకమైన 'నిజం' నీవైపు ఉంటే న్యాయం నీదే.
కుల మత ప్రాంతం భేదాలతో కొందరి మెప్పు కోసం లేదా తమ స్వార్థం కోసం చట్టాలను చేతిలోకి తీసుకొని అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వాళ్లకు #జైభీమ్ సినిమా ఒక చెంపపెట్టు.
"అడ్రెస్స్ అంటూ లేని గిరిజన బతుకులకు వాళ్ళు బతికే జాగా కు అడ్రెస్స్ ఇవ్వరు, ఇస్తే ఓటు హక్కు అడుగుతారు, ఓటు కోసం ఈ అణగారిన జాతి కాళ్ళ వేళ్ళ పడాల్సి వస్తుంది" అని ఆలోచించే నాయకులు ఉన్న ఈ దేశంలో.... న్యాయం జరగాలంటే పోరాడాల్సిందే....
ఎందుకు ఈ ''వెట్టి" చేసిన బతుకులకే శిక్షలు పడుతున్నాయి. దేశంలో ఉన్న అన్ని జైల్లలో ఈ వెట్టి మనుషులే దొషులుగా మిగులుతున్నారు ఎందుకు.
మనం న్యాయం కోసం పోరాడే సమయంలో కేవలం చట్టాలను న్యాయ సూత్రలానే నమ్ముతున్నాం.
కానీ వాటిని అమలు పరిచే వాడికి "మనస్సాక్షి" ఉందా?
#జైభీమ్ సినిమా ని అందరికీ చేరేలా చేయాలి. అందరు చూడాలి.
మన చట్టాలు మనకు ఇచ్చిన హక్కులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన స్వాతంత్ర భారత్ అవుతుంది.
ఇప్పటికీ ఎన్నో *లాకప్ డెత్* మిస్టరీలు బయట పడడం లేదంటే ఎలా ఉందొ చూడు వ్యవస్థ.
మన వ్యవస్థలో ప్రతిదీ లంచం తో ముడి పడి ఉన్నది... అదే మన వెనకబాటుకు కారణం.
జై భీమ్! జై ఇండియా!!